Bollywood Stars : బాలీవుడ్ స్టార్స్ ఇళ్ల ఖర్చు తెలిస్తే షాక్..!..
బాలీవుడ్ స్టార్స్ అంతా కొత్త ఇంటివారు అవుతున్నారు.. ఈ కరోనా పాండమిక్ టైమ్లో కూడా తెగ ఆస్తులు కొనేస్తున్నారు..
Bollywood Stars: బాలీవుడ్ స్టార్స్ అంతా కొత్త ఇంటివారు అవుతున్నారు. ఈ కరోనా పాండమిక్ టైమ్లో కూడా తెగ ఆస్తులు కొనేస్తున్నారు. నచ్చిన ఇంటిని సొంతం చేసుకోవడం కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. ముంబయ్లోని కాస్ట్లీ ఏరియాలలో ఇళ్లపై కన్నేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్..
బాలీవుడ్ స్టార్స్ అంతా ముంబయ్లో ఖరీదైన ఇంళ్లపై పడ్డారు. వరసగా కాస్ట్లీ హౌసెస్ కొనేస్తున్నారు. ఎక్కువగా ముంబయ్ కాస్ట్లీ ఏరియా జూహులో స్టార్స్ అంతా ఒక చోటికి చేరుతున్నారు. రీసెంట్గా స్టార్ హీరో అజయ్ దేవ్గణ్.. దాదాపు 60 కోట్ల విలువైన ఇంటిని జూహులో కొన్నారు. శివశక్తి పేరుతో ఇప్పుడుంటున్న ఇంటికి దగ్గరలోనే కొత్త ఇంటిని కొన్నారు. వీరి ఇంటికి దగ్గరలోనే అమితాబ్ కూడా ఇటీవలే 31 కోట్లతో 27,28 అంతస్తులు కలుపుకుని డూప్లెక్స్ ప్లాట్ కొనుక్కున్నారు. ఇది తన మనవరాలి కోసం బిగ్ బీ కొన్నట్టు తెలుస్తోంది.
స్టార్ హీరోలంతా నైబర్స్ అయిపోతున్నారు. ముంబయ్లోని బాంద్రా, జూహు చుట్టుపక్కలే అంతా చేరుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గణ్, ధర్మేంద్ర, హృతిక్, లాంటి స్టార్స్ నైబర్స్గా మారారు. ఈ ఏరియాలోనే రీసెంట్గా యంగ్ హీరో అర్జున్ కపూర్ ఓ ప్లాట్ కొన్నారు. తన ప్రియురాలు మలైకా అరోరా ఇంటికి దగ్గరగా ఉండటం కోసం 23 కోట్లు పెట్టాడు అర్జున్ కపూర్. ఇక అదే ఏరియాలో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ 16 కోట్లకు అట్లాంటిస్ అపార్ట్మెంట్లో 12వ అంతస్తులో ఫ్లాట్ కొన్నారు.
మరో వైపు శ్రీదేవి వారసురాలిగా ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో పాతుకు పోతున్న హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఇదే ఏరియాలో ఇల్లు కొనుగోలు చేసింది. దాదాపు 40 కోట్లతో 3000 గజాలకు పైగా ఉన్న ఇంటిని జాన్వీ కొనేసింది. బాలీవుడ్లో టాప్ సీనియర్ స్టార్స్కు నైబర్గా మారిపోయింది జాన్వీ. వీళ్లే కాదు, టాలీవుడ్ హీరోయిన్స్ పూజా హెగ్డే, తమన్నా, కాజల్ ఇలా చాలా మంది స్టార్స్ ముంబయ్లో రీసెంట్గా సొంత ఇంటివారు అయ్యారు. రష్మికా కూడా ముంబయ్లో ఇల్లు కొనాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.