బోల్తా పడ్డ కారు..లోకేశ్ కు తీవ్ర గాయాలు
సూర్యాపేట నాగారం సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అర్వేపల్లి ఎస్సై లోకేశ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన పోలీసులు వెంటనే ఎస్సై లోకేశ్ ను హాస్పిటల్ కు తరలించారు.
కానీ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ఎస్సై లోకేశ్ తన కారులో గుమ్మడవల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అతి వేగానికి..ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నాయరు. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నిండుకుంటున్న విషయం తెలిసిందే.