Itlu Maredumilli Prajaneekam: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల కామెడీ సినిమాలకు పూర్తి భిన్నంగా కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘నాంది’ ఓ డిఫరెంట్ కథతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా ఓ సీరియస్ కథతో తెరకెక్కుతోంది.
Allari Naresh : ఓట్ల కోసం నరేష్ ప్రయాణం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..
ఈ సినిమాను దర్శకుడు ఏఆర్ మోహన్ సీరియస్ డ్రామాగా తెరకెక్కిస్తుండగా, ఈ మూవీలో గిరిజన జాతిలో పుట్టిపెరిగిన వారి జీవితాలను నరేష్ ఏ విధంగా మార్చాడనేది మనకు సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్లో చూపించారు. ఇక ఈ సినిమాలో నరేష్కు మరోసారి పర్ఫార్మెన్స్కు పూర్తి స్కోప్ ఉన్న పాత్ర లభించిందని చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది. కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్ను ముగించినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Naresh59: అల్లు నరేష్ కొత్త సినిమా.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’!
షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి, వీలైనంత త్వరగా వాటిని కూడా ముగించాలని చూస్తోంది. ఇక ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ మూవీలో నరేష్తో పాటు ఆనంది, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
Team #ItluMaredumilliPrajaneekam wrapped up the complete shoot of the film ?#IMP @allarinaresh @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @abburiravi @SricharanPakala @RaamDop pic.twitter.com/T9Kq3HBpKx
— Hasya Movies (@HasyaMovies) August 21, 2022