Cucumber Cultivation : బోరాన్ లోపంతో తగ్గుతున్న దోస దిగుబడులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ముఖ్యంగా బోరాన్ లోపం తో  పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు  పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5  ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

Cucumber Cultivation

Cucumber Cultivation : తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ పంటలు విస్తీరంగా సాగుచేస్తుంటారు. ముఖ్యగా తీగజాతి పంటైన కూరదోస మంచి ప్రాచూర్యం పొందిన పంట. ఈ పంటకు అనేక రకాల పోషకాల సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడులపై  తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పూత ,  పిందె దశలలో ఉన్న ఈ పంటకు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తించిన వెంటనే రైతులు సరైన యాజమాన్యం చేపడితే బోరాన్ లోపాన్ని నివారించి నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేందుకు ఆస్కారముందంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డా. రాంప్రసాద్.

READ ALSO : Avoid Eating Raw Vegetables : ఈ నాలుగు రకాల కూరగాయలు, పండ్లు పచ్చిగా తినకూడదు తెలుసా ?

ప్రపంచ దేశాలలో ఎంతో ఆరోగ్యవంతమైనదిగా కొనియాడబడుతున్న దోస, వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లో సాగుచేస్తున్నారు రైతులు. కేవలం ఒక ప్రత్యేక నేల అని కాకుండా ఎటువంటి నేలలోనైనా విరివిగా పెరుగుతుంది. అతితక్కువ సమయంలో చేతికి వచ్చే ఈ పంటకు పోషకాల లోపం చాలా వరకు ఉంటుంది.  రైతులు రసాయన ఎరువులను మాత్రమే అందిస్తూ ,సూక్ష్మపోషకాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పోషకాల లోపం ఏర్పడుతుంది.

READ ALSO : AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ సచివాలయాల్లో ఆర్టీఐ వ్యవస్థ ఏర్పాటు

ముఖ్యంగా బోరాన్ లోపం తో  పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు  పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5  ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైతులు జాగ్రత్త పడి నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్ర , సీనియర్ శాస్త్రవేత్త డా. రాంప్రసాద్.

READ ALSO : Tiger Cub Found Dead : చీతాలే కాదు పులి కూన కూడా మృతి

దోసలో  సమగ్ర ఎరువుల యాజమాన్య చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చు. ఎకరాకు రెండున్నర కిలోల యూరియా, రెండు కిలోల పొటాష్ ఎరువులను 15 విడుతలుగా 45 రోజుల వరకు వేస్తుండాలి. ఆ తరువాత 2 కిలోల యూరియా, 3 కిలోల పొటాష్ ఎరువును నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా అందించాలి . పూత, పిందె ప్రారంభమైన తరువాత మల్టికె-10 లేదా 0.5 మిల్లీ లీటర్ల స్కోర్‌ను లీటరు నీటికి కలిపి 2-3 సార్లు పిచికారీ చేస్తే నాణ్యమైన మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.