Cotton Crop : పత్తిలో రసంపీల్చే పురుగుల నివారణ

Cotton Crop : రసంపీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయింది.

Sucking Pest Management in Cotton Crop

Cotton Crop : గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తిచేలు, ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా రసంపీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల  ఆకులు రంగు మారిపోయి, మొక్కలు సరిగా ఎదగటంలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

వీటితో పాటు గులాబీరంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు , ప్రధాన శాస్త్రవేత్త రాంప్రసాద్.

సమయానుకూలంగా రైతులు పత్తిని విత్తారు. తరువాత వర్షాలు లేకపోవడంతో 20 రోజుల పాటు పంట బెట్టకు గురైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంట పునర్జీవం పోసుకున్నాయి. ప్రస్తుతం 40 నుండి 60 రోజుల దశలో పంట ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి.

ఈ దశలో రసంపీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల  పెరుగుదల తగ్గిపోయి, దిగుబడులపై ప్రభావం తీవ్రంగా వుంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు  ప్రధాన శాస్త్రవేత్త  రాం ప్రసాద్ .

వరుసగా కురిసిన వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వీటి వల్ల పిండినల్లి ఆశించే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు చేపట్టాలి. అంతే కాదు మద్య మధ్యలో బెట్టపరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సయంలో పైపాటుగా ఎరువుల, సూక్ష్మపోషకాలను అందించాలి. వాతావరణ పరిస్థితుల కారణంగా  గులాబిరంగు ఆశించే అవకాశం ఉంది. రైతులు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ట్రెండింగ్ వార్తలు