Paddy Varieties : పోషకాల వరి వంగడాలు.. డయాబెటిక్ దూరం చేసే వరి రకాలు

ప్రస్తుతం అదే వరి ఉత్పత్తిలో, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.

Paddy Varieties : వరి సాగు విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో.. ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత వైపు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అడుగులు వేస్తోంది. ప్రతికూల పరిస్థితులు తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే పంటల వైపు రైతులను తీసుకెళ్తోంది.

Read Also : Paddy Cultivation : వరిలో అగ్గి తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు  

వారి ఆదాయాలు పెంచే క్రమంలో కొత్త వంగడాలను రూపకల్పన చేస్తోంది. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఐసీఏఆర్, భారతీయ వరి పరిశోధన సంస్థ పార్టిఫైడ్ రైస్ వరి వండగాలకు రూపకల్పన చేసింది. ఆ రకాలేంటీ.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

భారత దేశంలో పండే అతి ముఖ్యమైన పంటల్లో వరి ఒకటి. ఇది దక్షిణ భారతీయులకు ముఖ్యమైన ఆహారం. దేశంలో ఉన్న 50 శాతం పంట భూములలో వరి పండుతుంది. ఇప్పటికీ దేశంలో 70 శాతం జనాభాకు వరి అన్నం తినడం అలవాటు. ఒకప్పుడు భారత్‌ వరి పంటలో  విదేశాలపై ఆధారపడింది.

కానీ.. ప్రస్తుతం అదే వరి ఉత్పత్తిలో, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. తెలంగాణలో హైదరాబాద్ రాజేంద్రనగర్ భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కొన్ని రకాల వంగడాలను అభివృద్ధి చేశారు. ఇవి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. మరికొన్ని రకాలైతే ప్రపంచంలో దాదాపు 40 నుండి 50 దేశాల్లో సాగవుతున్నాయి.

భారత్‌ ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఆహార భద్రత సుస్థిరమవుతున్న దశలో ఇకపై పౌష్టికాహార లోపం కూడా ఉండకూడదని, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా శాస్త్రవేత్తలను పలు వరి రకాలను రూపకల్పన చేశారు. మరి ఆ పార్టిఫైడ్‌ రైస్‌ గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Paddy Cultivation : వరిలో ఎలుకలను అరికట్టే పద్ధతి.. నివారణకు ఎరతెర పద్ధతిని పాటిస్తున్న శాస్త్రవేత్తలు

ట్రెండింగ్ వార్తలు