Amanchi Swamulu – Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు కలిశారు. పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పు గుచ్చంను అందజేశారు.
నాగబాబు, నాదేండ్ల మనోహర్ ను స్వాములు, అయన కుమారుడు రాజేంద్ర కలిసి పూలబోకేను అందించారు. జనసేన పార్టికి తన అవసరం మేరకు పని చేస్తానని పవన్ కు స్వాములు తెలిపారు. ‘మీ లాంటి పెద్దలు పార్టీకి ఏంతో అవసరం’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
AP Politics: రావివారిపాలెం మర్డర్ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే స్వామి హాట్ కామెంట్స్
జూన్ నెల ఆఖరులో స్వాములు జనసేన తీర్దం పుచ్చుకోనున్నట్లు సమాచారం. గత 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తో స్వాములు భేటి అయ్యారు.