ఏపీలో గత24 గంటల్లో 570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 22.305 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 570 కేసులు నమోదయ్యయాన్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,353 కు చేరింది. 191 మంది నిన్న కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్ళకు వెళ్లారు.
కోవిడ్ వల్ల గురువారం రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణలో నలుగురు. గుంటూరులో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరూ మరణించారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7,91,624 మందికి పరీక్షలు నిర్వహించారు.
కాగా….కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్కు గురువారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హోమ్క్వారంటైన్లో ఉన్నారు. కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు ఎమ్మెల్యేను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read: రైతుల ఖాతాలో పంటల బీమా పరిహారం : గత ప్రభుత్వం బకాయిని తీర్చిన సీఎం జగన్