TDP Members Suspend
TDP Members Suspend : ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభ నుంచి టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. వ్యవసాయంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టబట్టారు.
స్పీకరం పోడియం వద్దకు దూసెళ్లి ఆందోళన చేపట్టారు. వ్యవసాయంపై చర్చకు ఎల్లుండి అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు. కానీ టీడీపీ సభ్యులు వినకుండా అలాగే ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
Kodali Nani: పాదయాత్ర రాజధాని కోసమా..? చంద్రబాబు కోసమా? ఏపీ అసెంబ్లీలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో సభ నుంచి ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు. గొడవ చేస్తూ సభకు అడ్డుపడటం సరికాదని వైసీసీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.