AP Government: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకాలు ప్రకటన
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద పిల్లల చదువు కోసం ఒక లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇవ్వనుంది.
- Naveen
- Published On : March 1, 2026 / 04:24 PM IST
AP Government Representative Image (Image Credit To Original Source)
AP Government: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పథకాలను ప్రకటించింది. మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలను అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ విద్యా లక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి, ఉచిత స్మార్ట్ ఫోన్లు స్కీమ్ లు అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద పిల్లల చదువు కోసం ఒక లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇవ్వనుంది. ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం చేయనుంది. యానిమేటర్లకు 15వేల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనుంది.
