Black Fungus : తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ టెర్రర్, ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలను బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఏపీ, తెలంగాణను ఫంగస్‌ వర్రీ టెన్షన్‌ పెడుతోంది. వైరస్‌ బారిన పడి ప్రాణాలు దక్కించుకున్నా.. ఫంగస్‌ ప్రాణాలు ప్రాణాలు తీస్తోంది.

Black Fungus Terror In Telugu States

Telugu States : తెలుగు రాష్ట్రాలను బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఏపీ, తెలంగాణను ఫంగస్‌ వర్రీ టెన్షన్‌ పెడుతోంది. వైరస్‌ బారిన పడి ప్రాణాలు దక్కించుకున్నా.. ఫంగస్‌ ప్రాణాలు ప్రాణాలు తీస్తోంది. ఇప్పటివరకు బ్లాక్‌ ఫంగస్ బారిన పడి ఏపీలో ముగ్గురు.. తెలంగాణలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కరోనా కాటు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న తెలుగు రాష్ట్రాలపై బ్లాక్‌ ఫంగస్‌ పంజా విసురుతోంది.

దేశంలో ముందుగా గుజరాత్‌‌లో కనిపించిన బ్లాక్‌ ఫంగస్ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రకూ పాకింది. ఇప్పుడు తెలంగాణ, ఏపీలో కూడా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదుకావడం భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించారు వైద్యులు. ఆంధప్రదేశ్‌లో బ్లాక్ ఫంగస్ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. బ్లాక్‌ ఫంగస్‌‌తో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, కర్నూలు సర్వజన ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకొని కోలుకున్నారు.

తర్వాత బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఆ ఇద్దరూ కన్నుమూశారు. కర్నూలుకు చెందిన మరో యువకుడు హైదరాబాద్‌ ఆస్పత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో మరణించాడు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు . పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అంజిబాబుకు బ్లాక్‌ పంగస్ సోకి ఓ కన్ను వాచింది. తన భర్తకు ట్రీట్‌మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు అంజిబాబు భార్య.

తెలంగాణలో ఖమ్మం, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున బ్లాక్‌ ఫంగస్‌తో చనిపోయారు. తెలంగాణ‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులను కోఠి ఈ.ఎన్.టీ ఆస్పత్రి నోడ‌ల్ కేంద్రం నుంచి వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కంటి సమస్య ఉన్నవారికి సరోజనీదేవి కంటి ఆస్పత్రి వైద్యులతో ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు.

అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్‌ మైకోసిస్‌ ఫంగస్ ప్రమాదకరమైనదే అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నుంచి కోలుకున్నవారిలో లేదా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవారిలో ఈ బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు.

Read More : Covaxin : తెలంగాణలో కోవాగ్జిన్ టీకాకు తాత్కాలిక బ్రేక్