Chandrababu : జైల్లో చంద్రబాబు ఉదయాన్నే లేచి ఏం చేశారో తెలుసా..?

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా తన రోజువారి దినచర్యలను క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. వేకువజామునే లేచారు. ఆయనకు సహాయకుడిగా ఓ ఖైదీని నియమించారు.

Chandrababu in Rajahmundry Jail

Chandrababu in jail : టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లి ఈరోజుకు రెండు రోజులు. జైలులో కూడా చంద్రబాబు తన రోజువారి దినచర్యలను క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. వేకువజామునే లేచి యోగా, వాకింగ్ చేయటం చంద్రబాబు దినచర్యలో భాగం. అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవే తన ఆరోగ్య సూత్రాలు అని చంద్రబాబు చెబుతుంటారు. దీంట్లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు రెండో రోజు వేకువజామునే లేచి యోగా, వాకింగ్ చేశారు.

అలాగే తన కార్యక్రమాలు ముగించుకుని వార్తా పేపర్లు తెప్పించుకుని చదివారు. సోమవారం అంటే (సెప్టెంబర్ 11,2023) లంచ్ లో బ్రౌన్ రైస్ తో బెండకాయ ఫ్రై, పన్నీరు,పెరుగు తిన్నారు.ఆయన తినే ఆహారం అంతా కాన్వాయ్ లోని ప్యాంట్రీ కార్ నుంచే వస్తోంది. జైలులో చంద్రబాబుకు సహాయకుడిగా ఓ ఖైదీని ఏర్పాటు చేశారు. ఆయకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశామని చెబుతున్నారు అధికారులు.

సోమవారం రాత్రి త్వరగా నిద్రపోయిన చంద్రబాబు మంగళవారం ఉదయాన్నే లేచి వాకింగ్, యోగా చేసి.. అనంతరం న్యూస్ పేపర్లు చదివారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన కోసం ఏర్పాటు చేసిన సహాయకుడు అందించిన అల్పాహారాన్ని తిన్నారు. ఆ తరువాత ఆయన వేసుకోవాల్సిన మెడిసిన్స్ కూడా వేసుకున్నారు.

TDP Crisis : టీడీపీని నడిపించే నాయకుడు ఎవరు? చంద్రబాబు అరెస్ట్‌తో క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం, పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని గడ్డుకాలం

కాగా సోమవారం చంద్రబాబు కుటుంబ సభ్యులతో ములాఖత్ కుదరకపోవటంతో ఈరోజు అంటే మంగళవారం తన కుటుంబసభ్యులతో చంద్రబాబు ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. జైల్లో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఒక పత్రేక గదిని ఆయనకు ఇచ్చారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది.

స్కిల్ డెవలప్ మెంట్ కొర్పొరేషన్ ఏర్పాటులో స్కామ్ జరిగిందని..దాంట్లో చంద్రబాబు ప్రధాన సూత్రధాని అనే ఆరోపణలో సీబీఐ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు సెప్టెంబర్ 22 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

కాగా చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ నేతలు రెండో రోజు కూడా నిరసనలు వ్యక్తంచేస్తున్నాు. ఉమ్మడి 13 జిల్లాలు అంతటా టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి కార్యాచరణపై చర్చిస్తున్నారు.