నామినేషన్ల ఉపసంహరణ సమయం కంటే ముందే ఆఫీస్ గేట్లు మూసివేత

Municipal Corporation officials Enthusiasm : విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సమయం కంటే ముందే కార్యాలయం గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ముందే గేట్లు మూసివేయడంతో నామినేషన్ల ఉపసంహరణ కోసం వచ్చిన అభ్యర్థులు అవస్థలు పడ్డారు.

మూసివేసిన గేట్ల ముందు అభ్యర్థులు నిరీక్షించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. బరిలో ఉండిపోతానని అభ్యర్థి హెచ్చరించారు. గేట్లు తీసేదిలేదని ముందుగా బెట్టు చేసిన అధికారులు.. ఆ తర్వాత తీశారు.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈనెల 10న 12కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 17వేల 415 నామినేషన్లు దాఖలయ్యాయి. 2వేల 900లకు పైగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది.

ట్రెండింగ్ వార్తలు