CM Jagan : రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం జగన్ లేఖలు

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆయన లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.

AP CM Jagan : భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆయన లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్ల సరఫరాపై ఒకే వాయిస్ వినిపించాలని కోరారు. గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్కరూ బిడ్ వేయలేదని, గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే..వ్యాక్సిన్ లభ్యతపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ సరఫరా రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Read More : GHMC Alert Rainy Issues : వర్షాకాలపు సమస్యలపై జోనల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం

ట్రెండింగ్ వార్తలు