పద్మజ కుటుంబం మానసిక వ్యాధితో బాధపడుతోంది-సైక్రియాటిస్ట్ రాధిక
- murthy
- Published On : January 26, 2021 / 04:11 PM IST
daughters killer padmaja family suffering with psychiatric disorders : చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం కలిగించిన జంట హత్యల కేసులో మృతులు తల్లితండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యురాలు రాధిక వైద్య పరీక్షలు నిర్వహించారు.
పద్మజ తండ్రి ఇటీవలే మానసికి వ్యాధితో బాధ పడుతూ ఇటీవల చినపోయినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. పద్మజ మేనత్త కూడా మానసిక వ్యాధితో బాధ పడుతోందని తెలిసింది. పద్మజ కూడా తీవ్ర మానసిక వ్యాధితో బాధ పడుతోంది. దీన్ని మానసిక శాస్త్రంలో డెల్యూషన్స్ అంటారని డాక్టర్ రాధిక వివరించారు.
ఈ వ్యాధి గ్రస్తులు తాము నమ్మిన విషయాన్ని బలంగా విశ్వసిస్తారు.పద్మజకున్న మానసిక సమస్యను భర్త కూతుళ్లకు కూడా అంటించింది. పద్మజ, పురుషోత్తం నాయుడు రికవరీ అయ్యే అవకాశం ఉందిని ఆమె వివరించారు.
