ఫైళ్ల కాల్చివేతపై పవన్ కల్యాణ్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు

దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్.

Deputy Cm Pawan Kalyan : ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దహనం చేసిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఫైళ్లు, రిపోర్టులు దగ్ధం చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.

దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్. అంతేకాదు దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రికార్డులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి? ఫైళ్లు, రిపోర్టులు భద్రపరిచేందుకు అనుసరిస్తున్న విధానాలను తెలపాలని అధికారులతో చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్, రికార్డులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అర్థరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి కీలకమైన ఫైల్స్ ను దగ్ధం చేస్తుండగా.. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరు ప్రస్తుతం యనమలకుదురు పోలీసుల ఆధీనంలో ఉన్నారు. పోలీసులు వారిద్దరిని విచారిస్తున్నారు. ఫైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ఆదేశాల ప్రకారం దగ్ధం చేశారు? అనేది పూర్తి స్థాయిలో విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశించారు. దగ్ధం చేయబడిన ఫైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపించారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Also Read : పిన్నెల్లి ఏమైనా గాంధీ మహాత్ముడా?: వైఎస్ జగన్‌కు టీడీపీ నేత ప్రశ్న

ట్రెండింగ్ వార్తలు