కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ సమయంలో

Chandrababu House : ఏపీలో కొందరు అధికారులు లంచావతారులుగా మారుతున్నారు. ఏ చిన్న పనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయాలన్నా వారి చేతికి డబ్బులు ముట్టజెప్పాల్సిందే. అలాంటి అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ అధికారి మరీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు సంబంధించి అనుమతులకోసం పెద్ద మొత్తంలో లంచం అడిగాడు. ఈ ఘటన గత ప్రభుత్వం హయాంలో జరగగా.. ప్రస్తుతం సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : అభిమానం చాటుకున్న జనసైనికులు.. ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారు

కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ సమయంలో కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ హుస్సేన్ అత్యుత్సాహం ప్రదర్శించి ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ. 1.80లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు లక్ష రూపాయలు లంచం తీసుకున్నాడు.

Also Read : మంత్రి భార్య తీరుపై చంద్రబాబు సీరియస్.. ఉపేక్షించేది లేదని వార్నింగ్

డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్న విషయాన్ని ఇటీవల సీఎం హోదాలో కుప్పంకు వెళ్లిన చంద్రబాబు నాయుడు దృష్టికి స్థానిక టీడీపీ నేతలు తీసుకెళ్లారు. కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుతో విచారణ జరిపించాలని ఆ సమయంలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో సర్వేశాఖ ఏడీ గౌస్ బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా.. డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నది నిజమేనని తేలింది. దీంతో అతన్ని సస్సెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు