Divvala Madhuri : దువ్వాడ ఫ్యామిలీ ఫైట్.. సోషల్‌ మీడియాలో హీటెక్కిస్తున్న దివ్వెల మాధురి పోస్టులు

దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Divvala Madhuri

Divvala Madhuri : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న కొత్త ఇంటి ఎదురుగా అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ సైతం కొద్దిరోజులుగా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. బయటకు రావడం లేదు. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఓ పక్క కుటుంబ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు వాణి కోర్టును ఆశ్రయించారు. తాజాగా దువ్వాడ వాణి కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మరో అమ్మాయికి పెళ్లి కావాల్సి ఉంది. ఆయన ఎలా ఉన్నా.. ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను. పిల్లల బాధ్యత అంతా ఆయనే తీసుకోవాలి. నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఈ మేరకు ఆయనతో లిఖితపూర్వకంగా రాజీ కుదుర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పిల్లల పేరుమీద, నా పేరు మీద ఆస్తులు రాయాలని నేను కోరుకోవడం లేదు. శ్రీనివాస్, నేను, పిల్లలు ఒకే ఇంట్లో కలిసి ఉందామని వాణి చెప్పారు.

Also Read : Duvvada Family Controversy : రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం..

వాణి వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. వాణి రోజుకోరకంగా మాట్లాడుతుంది. మొదట తనపైకి పిల్లలను పంపించిన వాణి.. ఆ తరువాత టెక్కలి వదిలి వెళ్లిపోవాలని చెప్పింది. ఆస్తులపై మాట్లాడింది. ఇప్పుడు కొత్తగా కలిసి ఉందామని చెబుతుందని మండిపడ్డారు. ఆమె న్యాయవాది చెప్పడంతోనే వాణి మాట మార్చారు. రాజకీయంగా తనను పతనం చేయాలన్నదే వాణి ఉద్దేశమని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తనకు విడాకులు కాాలని,  వాణితో కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశాడు.

Also Read : Aditya Tiwari : వావ్.. ఈ బుడ్డోడు చేస్తున్న పనికి సెల్యూట్ చేయాల్సిందే.. వీడియోలు చూస్తే ఫిదా అవుతారు

మరోవైపు దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె దువ్వాడ శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘ఇష్టంగా అనుకున్నాను. కానీ, వ్యసనంగా మారిపోయావు.. తనకున్న ఒకేఒక్క డ్రీమ్ చివరి వరకు నీతో తోడుగా ఉండాలని, నిన్ను హ్యాపీగా చూసుకోవాలని’ మాధురి రీల్ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ను ఉద్దేశించే ఆమె ఇలాంటి పోస్టులు చేశారన్న చర్చ జరుగుతుంది. మొత్తానికి సోషల్ మీడియాలో దివ్వెల మాధురి పెట్టిన పోస్టులు హీటెక్కిస్తున్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు