×
Ad

Mischief In Tirumala : తిరుమల శ్రీవారి ఆలయం వద్ద చెప్పులు వేసుకుని తిరిగిన నయనతార దంపతులు

తిరుమలలో విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫొటో షూట్ పేరిట ఆలయం ముందు అంత తతంగం జరుగుతున్నా విజిలెన్స్ పట్టించుకోలేదు.

  • Published On : June 10, 2022 / 05:10 PM IST

Nayanatara

Heroine Nayantara couple : తిరుమలలో అపచారం జరిగింది. హీరోయిన్ నయనతార కాళ్లకు చెప్పులు ధరించి శ్రీవారి ఆలయం వద్ద తిరిగింది. మాడవీధుల్లో చెప్పులతో తిరగడాన్ని నిషేధించారు.

కానీ అదేమీ పట్టనట్లు శ్రీవారి ఆలయం వద్ద కాళ్లకు చెప్పులు ధరించి నయనతార, ఆమె భర్త సంచరించారు. తిరుమలలో విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫొటో షూట్ పేరిట ఆలయం ముందు అంత తతంగం జరుగుతున్నా విజిలెన్స్ పట్టించుకోలేదు.

Nayan-Vignesh : నయనతార-విగ్నేష్ శివన్ పెళ్లి వేడుకలు

ఫొటో షూట్ కోసం నయనతార జంట శ్రీవారి ఆలయం దగ్గర ఉన్నారు. నయనతార జంటతో పాటు ఫోటోగ్రాఫర్లు కాళ్లకు షూష్, చెప్పులు వేసుకుని తిరిగారు.