×
Ad

Pawan Kalyan : ప్రభుత్వానిది ఆధిపత్య ధోరణి : పవన్‌ కల్యాణ్‌

సమ్మె వివరమణపై ఉద్యోగ సంఘాల నేతలు చేసిన ప్రకటనతో ఉపాధ్యాయ సంఘాలు విభేదిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిణగలోకి తీసుకుంటుందన్నారు.

  • Published On : February 6, 2022 / 08:22 PM IST

Pawan (1)

Janasena Pawan Kalyan : రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌ అయ్యారు. పీఆర్‌సీలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిగా న్యాయం జరగలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట లభించలేదన్నారు.

వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో వైసీపీ సర్కార్‌ చిత్తశుద్ధి కనపరచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, క్యాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ వంటి డిమాండ్లు పూర్తిగా పరిష్కారం కాలేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

MLA Roja : మీ ఆడిబిడ్డగానే చావాలని డిసైడయ్యాను : ఎమ్మెల్యే రోజా

సమ్మె వివరమణపై ఉద్యోగ సంఘాల నేతలు చేసిన ప్రకటనతో ఉపాధ్యాయ సంఘాలు విభేదిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిణగలోకి తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగుల భావోద్వేగాలకు జనసేన విలువ ఇస్తుందన్నారు.