Kodali Nani: సెటిలర్లు ఉన్న చోటే కేసీఆర్‌కు భారీ మెజార్టీ.. టీడీపీ చేసిందేంటి?: కొడాలి నాని

చంద్రబాబుకు సింపథీ ఉంది.. సెటిలర్లతో కేసీఆర్ ను ఓడిస్తామన్నారు. కానీ సెటిలర్లు ఉన్న చోటే కేసీఆర్ కు భారీ మెజార్టీ వచ్చి సీట్లు గెలుచుకున్నారు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం అనంతరం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కొందరు గాంధీ భవన్ వచ్చి సంబరం చేసుకున్నారు. టీడీపీ జెండాలతో రేవంత్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు గాంధీ భవన్ ముందు ఆ పార్టీ సన్నాసులు గెంతులేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

“చంద్రబాబుకు సింపథీ ఉంది.. సెటిలర్లతో కేసీఆర్ ను ఓడిస్తామన్నారు. కానీ సెటిలర్లు ఉన్న చోటే కేసీఆర్‌కు భారీ మెజార్టీ వచ్చి సీట్లు గెలుచుకున్నారు. రేవంత్ రెడ్డిని వీళ్లే సీఎం చేసినట్లు హంగామా చేస్తున్నారు. కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే. ఇప్పుడు ఆయన పోయి రేవంత్ వచ్చారు. ఇందులో టీడీపీ చేసిందేంటి?” అని కొడాలి నాని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు