ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ..! ఆ 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం

6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.

Ap New Liquor Policy : ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. నూతన మద్యం విధానం రూపకల్పనపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.

రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 4 బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్ లు, ధరలు, మద్యం కొనుగోళ్లతో పాటు నాణ్యం, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నెల 12లోగా నివేదికలు సమర్పించాలని 4 అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.

Also Read : ఏకంగా 59 మంది డీఎస్పీలను పక్కన పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. నారా లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేసేశారా?

ట్రెండింగ్ వార్తలు