ఇంట్లో ఎవరూ ఉండొద్దు, చంద్రబాబు నివాసానికి నోటీసులు
- Naveen
- Published On : October 13, 2020 / 04:02 PM IST
chandrababu house: ఉండవల్లిలోని ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు వరద హెచ్చరిక నోటీస్ జారీ చేశారు.
వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నివాసంలో ఎవరూ ఉండొద్దంటూ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అలాగే కరకట్ట వెంబడి ఉన్న అన్ని నివాసాలకు నోటీసులు జారీ చేశారు.
