Pawan Kalyan: జగన్ తనను తాను ఇలా పోల్చుకోవడం హాస్యాస్పదం: పవన్ పవర్‌ఫుల్ స్పీచ్

సొంత చెల్లెలు షర్మిలను తూలనాడే వారి వెన్ను తట్టి ఇంకా తిట్టించే వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ అన్నారు. 

కొన్ని వారాల్లో ఏపీలో జనసేన-తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేనలో వైసీపీ ఎంపీ బాలశౌరి చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదమని అన్నారు.

సిద్ధం అంటున్న జగన్ దేనికి సిద్ధం? అని పవన్ అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని, మద్యపాన నిషేధం చేస్తానని జగన్ చెప్పారన్నారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక దొంగ హామీలివ్వడానికి జగన్ మళ్లీ సిద్ధమా? అని నిలదీశారు. సొంత చెల్లెలు షర్మిలను తూలనాడే వారి వెన్ను తట్టి ఇంకా తిట్టించే వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ అన్నారు.

అందుకే బయటకు వచ్చా: బాలశౌరి
ఆశించిన స్థాయిలో ఏపీలో అభివృద్ధి జరగడం లేదని, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని బాలశౌరి చెప్పారు. సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారని దేనికి సిద్ధమని నిలదీశారు. ఇకపై పవన్ కల్యాణ్ తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు