×
Ad

PM Modi : బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ

పశ్చిమ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.

  • Published On : December 15, 2021 / 09:14 PM IST

PM Modi Ex gratia for RTC bus victims

PM Modi :  పశ్చిమ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతులు కుటుంబాలకు పీఎంఎన్ఆర్ ఎఫ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఖః సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను : ప్రధాన మంత్రి అని ట్విట్టర్ లో పేర్కోన్నారు.

బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Also Read : Nominated Posts : నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం కేసీఆర్

ఆర్టీసీ బస్సు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి‌గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన రెయిలింగ్‌ను ఢీకొని జల్లేరువాగులో బస్సు బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది. ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినది. జల్లేరువాగులో పడిన బస్సును దాదాపు మూడు గంటలపాటు శ్రమించి క్రేన్ల సాయంతో బస్సును బయటికి తీశారు.

ప్రమాదానికి గురైన బస్సు కొత్తదని..ఎలాంటి సమస్యలు లేవని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ చెప్పారు. గత వారం రోజులుగా ఎలాంటి సమస్యలు లేవని..రాలేదని ఆయన చెప్పారు. బస్సులో టెక్నికల్ సమస్యలు తలెత్తలేదని తెలిపారు. ఏపీ 37జెడ్ 193 నెంబర్ గల బస్సు లేటెస్టు వెహికిల్ అని ఆయన పేర్కొన్నారు.