×
Ad

PM Modi AP Tour : 16న ఏపీకి ప్రధాని మోదీ.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం.. కూటమి నేతలతో కలిసి రోడ్ షో..

PM Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానున్నాయి. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన సాగనుంది.

PM Modi

PM Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానున్నాయి. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన సాగనుంది.

ప్రధాని నరేంద్రమోదీ తన పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత కర్నూలులో కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యనేతలతో కలిసి జీఎస్టీ సంస్కరణలపై భారీ ర్యాలీలో పాల్గోనున్నారు. ఆ తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీల వద్ద మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు.