ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట..

తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

Vallabhaneni Vams : వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఈ నెల 20వ తేదీ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : జగన్ మళ్లీ అధికారంలోకి రారు- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు