Srisailam Ghat Road : కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. శ్రీశైల మల్లన్న దర్శనానికి ఆర్టీసీ బస్సులో వస్తున్న సమయంలో ఘాట్ అందాలను చూసేందుకు యువతి తన తలను బయటకు పెట్టింది. సరిగా అదే సమయంలో ఓ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీ యువతి తలను బలంగా ఢీకొంది.
చదవండి : Car Accident : బావిలోకి దూసుకెళ్లిన కారు.. వెలికితీయబోయి గజ ఈతగాడు మృతి
ఈ ఘటనలో యువతి తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. బస్సు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన యువతిది గుంటూరు జిల్లా నరసారావుపేటగా తెలుస్తోంది. పూర్తి వివరాలు వివరాలు తెలియాల్సి ఉంది. అజాగ్రత్తే యువతి ప్రాణం తీసిందని అంటున్నారు తోటి ప్రయాణికులు.
చదవండి : Car Accident Siddipet : సిధ్దిపేట జిల్లాలో విషాదం-బావిలో పడ్డ కారు