Tirumala : తిరుమలలో “సంప్రదాయ భోజనం”

గో ఆధారిత సాగుద్వారా పండించిన పంటతో చేసిన "సంప్రదాయ భోజనం" త్వరలో తిరుమలలో అందుబాటులోకి రానుంది.

Tirumala (2)

Tirumala : గో ఆధారిత సాగుద్వారా పండించిన పంటతో చేసిన “సంప్రదాయ భోజనం” త్వరలో తిరుమలలో అందుబాటులోకి రానుంది. మరో నెల రోజుల్లో సంప్రదాయ గో ఆధారిత భోజనం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆదివారం తిరుమల, తిరుపతిలో నిర్వచించిన కార్యక్రమాల్లో ఈ విషయం వెల్లడించారు. ఈ సంప్రదాయ భోజనాన్ని అన్నప్రసాద కేంద్రంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు జవహర్ రెడ్డి తెలిపారు.

ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే అన్ని వసతి సముదాయాలు, అతిథి గృహాల్లోని గదుల్లో గీజర్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

సెప్టెంబరు చివరినాటికల్లా అలిపిరి నడకమార్గాన్ని పూర్తిచేస్తామన్నారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సహకారంతో మరో నాలుగు నెలల్లో పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపూ, ధూప్‌స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ తదితర 15 రకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.