Vijayawada Court Ordered Prithviraj : ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన భార్యకు నెలనెలా భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. భార్యకు ప్రతి నెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. నెలనెలా 10వ తేదీన భరణం మొత్తం అందేలా చూడాలని తీర్పు ఇచ్చింది. కేసు దాఖలైనప్పటి నుంచి భరణం చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. 2016 ఏప్రిల్ నుంచి భార్య నుంచి పృథ్వీరాజ్ దూరంగా ఉంటున్నాడు.
విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్తో 1984లో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని.. సెక్షన్ 498 A గృహ హింస చట్టం కింద శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే భరణం ఇప్పించాలని 2017 జనవరి 10వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Chiranjeevi : అల్లు రామలింగయ్య లేకపోతే మేము లేము
పెళ్లి తర్వాత సినిమాల్లో వేశాలంటూ తిరిగే పృథ్విరాజ్కు ఖర్చులన్నీ తమ ఇంటి వారే ఇచ్చారని.. అయినా ఇంకా డబ్బు తేవాలంటూ వేధించేవారని భార్య శ్రీలక్ష్మి తన పిటిషన్లో ఆరోపించారు. 2016 ఏప్రిల్ 5వ తేదీన ఇంటి నుంచి గెంటేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నట్లు ఆమె ఆరోపించారు. ఆయనతో కలిసి ఉండటం తనకు సాధ్యం కావడం లేదని కోర్టుకు తెలిపింది.
పృథ్వీరాజ్ సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారని కోర్టుకు శ్రీలక్ష్మీ తెలిపింది. నెలనెలా ఆయన నుంచి రూ.10 లక్షల భరణం ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శ్రీలక్ష్మి పిటిషన్ను విచారించిన విజయవాడ ఫ్యామిలీ కోర్టు ప్రతి నెలా రూ.8 లక్షల భరణాన్ని 10వ తేదీలోగా చెల్లించాలని నటుడు పృథ్వీరాజ్ను ఆదేశించింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.