×
Ad

Votersటీడీపీ తరఫున నామినేషన్ వేసి వైసీపీలో చేరిక : ఆళ్లగడ్డలో రెండు వార్డులు ఏకగ్రీవం..ఎన్నికలు నిర్వహించాలంటున్న ఓటర్లు

 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓటర్లు రోడ్డెక్కారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 22, 23 వార్డుల్లో టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు వైసీపీలో చేరారు. దీంతో ఆ రెండు వార్డులు

  • Published On : March 6, 2021 / 05:42 PM IST

Oters Are Protest That Elec

Voters protest in Allagadda : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓటర్లు రోడ్డెక్కారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 22, 23 వార్డుల్లో టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు వైసీపీలో చేరారు. దీంతో ఆ రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అయితే అభ్యర్థులు పార్టీ మారడంపై ఆగ్రహించిన ఓటర్లు రోడ్డెక్కారు.

తమకు ఓటు హక్కు కల్పించాలని ఓటర్లు కోరారు. ఓటు హక్కు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు పర్మిషన్ లేకపోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మహిళా ఓటర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.