ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. బీజేపీ ప్రత్యక్షంగా మద్దతు ఇస్తోందని తెలిపారు. ఏపీలోని చెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయని తెలిపారు. కుట్రలకు భయపడేది లేదని చెప్పారు.
చంద్రబాబు, దత్తపుత్రుడితో పాటు బీజేపీ, కాంగ్రెస్ తనపై ఎగబడుతున్నారని జగన్ అన్నారు. ప్రజలను మోసం చేయడమే పనిగా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల వేళ కూటమి పేరుతో మోసం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని అడిగారు.
ఎన్నికలు అంటే ఐదేళ్ల భవిష్యత్తు అని చెప్పారు. తాను 130 సార్లు ప్రజల కోసం బటన్ నొక్కానని అన్నారు. వైసీపీ సర్కారు దాదాపు 40 పథకాలను అందించిందని చెప్పారు. చంద్రబాబు నాయుడికి ఎన్నడైనా ఇంతమంచి ఆలోచన వచ్చిందా అని అడిగారు.
చంద్రబాబు అంటే చంద్రముఖి అని, అటువంటి ఆలోచనలు రావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో స్కాంలు మాత్రమే ఉంటాయని తెలిపారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు చెప్పాలని అన్నారు. దోచుకోవడం, పంచుకోవడమే ఆయన కలలని అన్నారు.
Also Read: తనను అవమానించానని డీకే అరుణ అంటున్నారు: రేవంత్ రెడ్డి