ప్రపంచీకరణ యుగంలో కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి మహమ్మారిగా మారగలదనే ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై సందేహాలను రేకిత్తిస్తోంది. ఇప్పటివరకూ కరోనా వ్యాప్తితో మరణాల సంఖ్య 3,000కి చేరుకుంది. 80వేలకు పైగా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఇటలీలో కరోనా వ్యాప్తి చెందడం ఇప్పుడు దాని ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తోంది. ప్రపంచ వృద్ధికి కరోనా వ్యాప్తి అసలు కారణం ఏంటో అర్థం చేసుకోవడానికి కొందరు ఆర్థికవేత్తలు వార్ గేమ్ ప్రారంభించారు.
గ్లోబల్ GDP నుండి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టడానికి అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం సరిపోతుందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది. పనులకు హాజరుకాకపోవడం, తక్కువ ఉత్పాదకత, స్లయిడింగ్ ట్రావెల్, పంపిణీ ఉత్పత్తులకు అంతరాయం కలిగించడం, వాణిజ్యం, పెట్టుబడులను తగ్గించడం వంటి వాటికి ఇది ఆర్థిక ధరను భారం చేస్తుందని తెలిపింది. పెట్టుబడిదారులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. యుఎస్ స్టాక్ బెంచ్ మార్క్ సోమవారం నాటికి 3శాతం కన్నా ఎక్కువ దిగజారిపోయింది. S&P 500 సూచిక ఫిబ్రవరి 2018 నుండి అత్యధికంగా క్షీణిస్తూ వస్తోంది.
See Also>>హాలీవుడ్ సినిమాకు కరోనా ఎఫెక్ట్ – టామ్ క్రూజ్ సినిమా వాయిదా
ప్రస్తుతానికి, సెంట్రల్ బ్యాంకర్లు, ప్రభుత్వాలు కోవిడ్ -19 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెద్దగా దెబ్బతీయవని సవాల్ చేస్తూనే ఉన్నాయి. వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత మళ్లీ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవటానికి ఇది అనుమతిస్తుంది. కానీ ఆ విశ్వాసంతో ఉన్నవారికి సవాల్ ఎదురువుతోంది. 2020 కోసం ప్రపంచ వృద్ధి అంచనా నుంచి 0.1 శాతం పాయింట్లను మాత్రమే వైరస్ ప్రభావితమైందని IMF ప్రస్తుతం లెక్కించగా.. IMF చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక కరోనా వైరస్ అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటనతో అది నిజంగా ఎంతో భయంకర మైనదిగా పేర్కొన్నారు. WHO ప్రకారం.. ప్రతిరోజు కరోనా కొత్త కేసులు నమోదు కావడం కూడా ఆందోళన కలిగిస్తోందన్నారు.
దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ పారాశ్రామిక భూభాగాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే క్రమంలో మూతపడిన చైనీస్ ఫ్యాక్టరీలు తిరిగి ఆన్ లైన్ లోకి ఇంకా రావాల్సి ఉంది. చైనాలోని కరోనా విజృంభణతో ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదు కావడం, జనజీవనం స్తంభించిపోవడం వంటి పరిస్థితులు మరింత భయాన్ని పెంచుతున్నాయి.
ఇప్పుడు ఈ వైరస్ ఇటలీలోనూ వ్యాపించి దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేయడేమే కాకుండా మిగిలిన భాగమైన ఐరోపాను కూడా దెబ్బతీస్తుంది. కొరియా ఆర్థిక వ్యవస్థ క్రమంగా మందగిస్తోంది. వినియోగదారుల విశ్వాసం ఐదేళ్ళలో అత్యధికంగా పడిపోయింది. కోవిడ్ -19 వైరస్ వేగంగా ఎంత దూరం వ్యాపిస్తుందోననే సందేహంతో జరుగబోయే ప్రమాదాన్ని ఎలా అంచనా వేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.