Gold and Silver Price Today : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?

బంగారం ధర మంగళవారం భారీగా పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..

Gold

Gold and Silver Rate Today 10th October 2023: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ ధరల్లో.. మంగళవారం మరోసారి భారీగా పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరిగింది. దీంతో నాలుగు రోజులుగా 10 గ్రాముల బంగారంపై సుమారు వెయ్యి రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధరకూడా పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరుగుదల చోటు చేసుకుంది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. మంగళవారం ఉదయం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 53,350కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 58,200 వద్ద కొనసాగుతుంది.

gold

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 58,350 వద్దకు చేరింది.
– చెన్నైలో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ. 50 తగ్గింది. దీంతో అక్కడ.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 53,650కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,530 వద్ద కొనసాగుతుంది.
– ముంబయి, కోల్ కతా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 53,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200 వద్ద కొనసాగుతుంది.
– బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 350 పెరగగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరిగింది. దీంతో అక్కడ.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,500కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ. 58,200 వద్ద కొనసాగుతోంది.

gold

పెరిగిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.500 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,500 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ.72,600 కు పెరగగా, బెంగళూరులో కిలో వెండి రూ. 69,000 వద్దకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు