దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.68,760గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,010గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,910గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,160గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.68,760గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,010గా ఉంది
వెండి ధరలు
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,00,600గా ఉంది
విజయవాడలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,00,600గా ఉంది
విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,00,600గా ఉంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.96,100గా ఉంది
ముంబైలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.96,100గా ఉంది