Gold Price Increased
Gold Price Increased : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వచ్చింది. అయితే, ఉన్నట్లుండి ఇవాళ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. వెండి ధర సైతం భారీగా పెరిగింది. (Gold Price Increased)
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,090 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. వెయ్యి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ 35డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 3,373 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. భారత దేశంలో వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 2వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.93,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,01,620 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,770 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.93,150 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,01,620కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,30,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,20,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,30,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.