Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం చారిత్రాత్మక రికార్డ్ సృష్టించింది. బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 282 పాయిట్లు వృద్ధి చెంది 63,698 పాయింట్లకు చేరింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 100 పాయింట్లు మెరుగుపడి 18,908 పాయింట్లకు చేరుకోవడం గమనార్హం. ఈ రెండు సూచీలు ఇంత పెద్ద వృద్ధి సాధించడం ఆల్ టైం రికార్డని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
Datia Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి నదిలో పడిన పెళ్లిబృందం ట్రక్కు ..
నిఫ్టీకి గతంలో 18,887 పాయింట్లు అత్యధిక రికార్డుగా ఉంది. కాగా బుధవారం ఆ రికార్డు చెరిగిపోయింది. అలాగే సెన్సెక్స్ గత వారమే 63,601 పాయింట్లకు చేరి ఆల్ టైం రికార్డు సృష్టించింది. అంతలోనే ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ ట్రేడింగ్లో ఒకానొక దశలో సెన్సెక్స్ 63,716 పాయింట్లను తాకింది. గడిచిన మూడు నెలల్లో నిఫ్టీ 11 శాతం పెరగగా, సెన్సెక్స్ 10 శాతం వృద్ధి చెందింది.
ఇక స్టాక్ మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ షేర్లు అత్యంత ప్రభావంగా ఉన్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
Intercropping In Oil Palm : పామాయిల్ లో అంతర పంటగా బొప్పాయి, పుచ్చసాగు
అంతర్జాతీంగా సానుకూల పరిస్థితులు, ఆసియ మార్కెట్లు లాభాల్లో ఉండటం దేశీయ మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉందనే సంకేతాలు, వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదు కావడం వంటి కారణలతో స్టాక్ మార్కెట్ సూచీలు గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సెన్సెక్స్ గత వారమే ఆల్ టైం రికార్డు సృష్టించగా, తాజాగా నిఫ్టీ కూడా సరికొత్త జీవిత కాల గరిష్టానికి చేరుకుని చరిత్ర సృష్టింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా, దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో విదేశీ పెట్టుబడుదారులతో పాటు, స్వదేశీ ఇన్వెస్టర్లు కూడా ప్రతికూలంగా ఉన్నారు.
ఇదే సమయంలో రూపాయి కాస్త బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ 4 పైసలు బలపడింది. మంగళవారం డాలర్ విలువతో 82.04 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ, బుధవారం 4 పెసలు బలపడి 82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.