×
Ad

Karnataka Liquor : అనంతపురం జిల్లాలో భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

అనంతపురం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Published On : June 10, 2021 / 05:53 PM IST

Anantapur Rs 10 Lakh Worth Karnataka Liquor Seized

Karnataka Liquor :  అనంతపురం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు మండలం కమ్మకొట్టాల గ్రామంలో నిల్వ చేసిన మద్యం డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా.

దాడి సందర్భంగా 141 బాక్సుల్లో నిల్వచేసిన 11,664 మద్యం టెట్రా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.నిబంధనలు విరుధ్దంగా కర్ణాటక మద్యం కలిగి ఉన్న నేరంపై నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.