×
Ad

Bridegroom Suicide : జనగామ జిల్లాలో విషాదం..పురుగుల మందు తాగి వరుడు ఆత్మహత్య

జనగామ జిల్లా పెద్దపహాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి నవ వరుడు సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతిని సాయి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ గ్రాండ్‌గా పెళ్లి చేస్తానని యువతి తండ్రి చంద్రయ్య నమ్మించి రప్పించాడు.

  • Published On : September 6, 2022 / 05:06 PM IST

bridegroom suicide

Bridegroom Suicide : జనగామ జిల్లా పెద్దపహాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి నవ వరుడు సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతిని సాయి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ గ్రాండ్‌గా పెళ్లి చేస్తానని యువతి తండ్రి చంద్రయ్య నమ్మించి రప్పించాడు.

యువతిని పంపకుండా చంద్రయ్య సాయిని వేధింపులకు గురి చేశాడు. దీనిపై సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు చెప్పారు. దీంతో సాయి పెద్దలతో పంచాయతీ పెట్టించాడు.

Groom End Life : పెళ్లి అయిన రాత్రే వరుడు ఆత్మహత్య

పెద్దల పంచాయితీలో సాయి నచ్చలేదని యువతి తండ్రి చంద్రయ్య చెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు.