Delhi: ప్రియురాలిని హతమార్చి ఫ్రిజ్‭లో పెట్టి, కొద్ది గంటల్లోనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు

Delhi: నేరాల రాజధానిగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటనే ఇది. నజాఫ్‌గఢ్‌లోని మిత్రాన్ గ్రామం శివార్లలో ఉన్న తన ధాబాలో తనతో సహజీవనం చేస్తున్న భాగస్వామిని గొంతు కోసం చంపేసి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో నింపేశాడు ఒక కర్కశుడు. ఇలా చేసిన కొన్ని గంటలకే మరో మహిళను వివాహం చేసుకోవడం గమనార్హం.

Karnataka BJP chief: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక బీజేపీ చీఫ్

దేశ రాజధానిలో జరిగిన ఈ దరుణ ఘటనలోని నిందితుడు సాహిల్ గెహ్లాట్, బాధితురాలి పేరు నిక్కీ యాదవ్. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం, 2018లో ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్‌లో బాధితురాలు నిక్కీ యాదవ్‌ను కలిశానని, కొంతకాలం తర్వాత సహజీవనం ప్రారంభించినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు.

Godavari Express Derailed: ఘట్కేసర్ NFC దగ్గర పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‭ప్రెస్

అయితే వేరే మహిళను వివాహం చేసుకోవాలని తన కుటుంబం చాలా కాలంగా ఒత్తిడి చేస్తోందని, చివరకు 2022 డిసెంబర్‌లో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వేరే మహిళతో తనకు నిశ్చితార్థం అయిందని పేర్కొన్నాడు. వివాహం ఫిబ్రవరి 9 తేదీని నిర్ణయించారు. అయితే ఈ తతంగం గురించి నిక్కీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ విషయం ఆమెకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సాహిల్ తన కారులో నిక్కీని ధాబాకు తీసుకుని వెళ్లి, అక్కడే ఆమె గొంతు కోసి హతమార్చినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

Ram Mandir Defaced: రామమందిరంపై ఇండియాకు మోదీకి వ్యతిరేకంగా రాతలు

ఫిబ్రవరి 9న నిక్కీని హతమార్చి, కొద్ది గంటల వ్యవధిలోనే అప్పటికే నిశ్చితార్ధం జరిగిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. గ్రామ శివార్లలోని దాబాలో మహిళను హత్య చేసి మృతదేహాన్ని దాచి ఉంచినట్లు మంగళవారం ఉదయం తమకు సమాచారం అందిందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) విక్రమ్ సింగ్ తెలిపారు. నిందితుడు మిత్రాన్‌ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, బాధితురాలు హర్యానాలోని ఝజ్జర్ నివాసి అని పోలీసులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు