Delhi: టీచర్ అరాచకం.. 5వ క్లాస్ విద్యార్థినిపై కత్తెర్లతో దాడి చేసి, ఆపై బాల్కనీ నుంచి తోసేసింది

దేశ రాజధాని ఢిల్లీలో ఓ అరాచకం జరిగింది. తన వద్ద చదువుతున్న విద్యార్థినిపై టీచర్ దారుణానికి పాల్పడింది. 5వ తరగతి చదువుతున్న పసిపాపై కత్తర్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా, ఆ బాలికను మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. ఢిల్లీలోని కరోట్ బాఘ్ ప్రాంతంలో శుక్రవారం జరిగిందీ సంఘటన. చిన్నారి పేరు వందన.

Delhi Teacher Attacks Class 5 Girl With Scissors, Throws Her Off Balcony

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ అరాచకం జరిగింది. తన వద్ద చదువుతున్న విద్యార్థినిపై టీచర్ దారుణానికి పాల్పడింది. 5వ తరగతి చదువుతున్న పసిపాపై కత్తర్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా, ఆ బాలికను మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. ఢిల్లీలోని కరోట్ బాఘ్ ప్రాంతంలో శుక్రవారం జరిగిందీ సంఘటన. చిన్నారి పేరు వందన. తీవ్ర గాయాలతో ప్రస్తుతం అత్యంత ఆందోళనకర స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అలాగే ఈ దారుణానికి పాల్పడ్డ టీచర్ పేరు గీత. ఆమెను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ పాఠశాలలోని టీచర్లు విద్యార్థులను కొట్టడం మామూలేనని, ఇలాంటి క్రితం అనేకం జరిగాయని స్థానికులు పోలీసులకు తెలిపారు. అనేక మంది విద్యార్థులు ఇలా గాయపడ్డారని, కొన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులు గొడవ పడతారని, అయినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదని వారు పేర్కొన్నారు.

Redmi Note 12 Pro Plus : రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ జనవరి 5న వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?