Hanuman Chalisa Row : మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి ఏర్పడాలంటే సమస్యలు పరిష్కారానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో అలజడి రేపింది. వెంటనే స్పందించిన మహా ప్రభుత్వం.. హైడ్రామా వద్ద పోలీసులు నవనీత్ కౌర్ దంపతులను అరెస్టు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వారిపై కేసు నమోదు చేశారు.
మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నవనీత్ కౌర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవనీత్ కౌర్ దంపతులకు అండర్ వరల్డ్తో లింకులున్నాయని ఆయన ఆరోపించారు. దావూద్ గ్యాంగ్కు అత్యంత సన్నిహితుడైన బాలీవుడ్ నిర్మాత యూసఫ్ లక్డావాలా నుంచి నవనీత్ కౌర్ రాణా దంపతులు రూ. 80 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు ముంబై పోలీసులకు సంజయ్ రౌత్ ఫిర్యాదు చేశారు. ఎంపీ సంజయ్ రౌత్ ఫిర్యాదు మేరకు పోలీసులు నవనీత్ కౌర్ దంపతులపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
యూసుఫ్ లఖడీవాలా రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతడితో లింకులు ఉన్న ప్రతిఒక్కరినీ ఈడీ విచారిస్తోందన్నారు. ఎంపీ నవనీత్ కౌర్ ఆర్థిక వ్యవహారాలపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ప్రశ్నించారు సంజయ్ రౌత్. నవనీత్ కౌర్ దంపతులు డీ- గ్యాంగ్తో సంబంధాలు కలిగి ఉండటం జాతీయ భద్రతకు ముప్పుకాదా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు.
యూసుఫ్ లఖడీవాలాకు చెందిన సొమ్ము.. నవనీత్ కౌర్ దంపతుల అకౌంట్లలో ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. డీ- గ్యాంగ్తో నవనీత్ కౌర్ దంపతులకు ఉన్న లింకులపై విచారణ చేపట్టాలని ముంబై ఎకనమికస్ ఆఫెన్స్ వింగ్ పోలీసులను ఆయన కోరారు. ఈ మేరకు సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ప్రదాని మోదీ, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ఆయనకు ట్వీట్కు ట్యాగ్ చేశారు. దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన నవనీత్ కౌర్ దంపతులపై కొత్త ఆరోపబణలతో మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది.
Read Also : Navneet Rana: పోలీసులపై నవనీత్ ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన కమిషనర్