ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మహిళపై అఘాయిత్యం.. ఇద్దరు డైవర్ల అరెస్ట్

ఆమెతో డైవర్ ఈర్ల కృష్ణబాబు మాటలు కలిపాడు. ప్రయాణికులు అందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో అదునుచూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Hyderabad moving bus case: నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసినట్టు చెప్పారు. కృష్ణబాబు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా, సిద్దయ్య అతడికి సహకరించాడని వెల్లడించారు. యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్టు చేశామని, వీరిపై 64 (1) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.

”బాధితురాలు తన కూతురితో కలిసి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. అయితే ఒకే బెర్త్ బుక్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణబాబు.. ఆమెతో మాటలు కలిపాడు. వెనకాల ఖాళీగా ఉన్న బెర్త్ లో పడుకోవాలని ఆమెకు సూచించారు. చేగుంటలో భోజనం చేసిన తరువాత సిద్దయ్య డ్రైవ్ చేశాడు. ప్రయాణికులు అందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో అదునుచూసి మహిళపై కృష్ణబాబు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించాడ”ని డీసీపీ బాలస్వామి తెలిపారు.

కాగా, హరికృష్ణ ట్రావెల్స్ బస్సు.. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తనపై కృష్ణబాబు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాధిత మహిళ ఆరోపించింది. అయితే బాధిత మహిళ చేసిన ఆరోపణలపై తోటి ప్రయాణికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కదులుతున్న బస్సు.. హోటల్ రూమ్‌లో అఘాయిత్యాలు.. హైదరాబాద్‌లో రెచ్చిపోయిన కామాంధులు

ట్రెండింగ్ వార్తలు