Drugs Case : చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ పాలక మండలి చైర్మన్ గా పని చేసిన దివంగత డీకే ఆదికేశవులు కుమారుడు డీకే శ్రీనివాస్ ను డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి బెంగుళూరు ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని యలహంక కార్యాలయంలో విచారిస్తున్నారు. శ్రీనివాస్ కు తెలుగు కన్నడ రాజకీయ సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిత్తూరు నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ రేసులో డీకే శ్రీనివాస్ ఉన్నారు.