Sand Mafia : ఇసుక మాఫియా అరాచకం-వీఆర్ఏ పై దాడి-మృతి

నిజామాబాదు జిల్లా బోధన్ మండలం ఖండ్‌గావ్ గ్రామంలో దారుణం జరిగింది. వీఆర్ఏ గౌతమ్ పై నిన్న రాత్రి ఇసుక మాఫియా దాడి చేసింది. దాడిలో వీఆర్ఏ మృతి చెందారు.

Sand Mafia :  నిజామాబాదు జిల్లా బోధన్ మండలం ఖండ్‌గావ్ గ్రామంలో దారుణం జరిగింది. వీఆర్ఏ గౌతమ్ పై నిన్న రాత్రి ఇసుక మాఫియా దాడి చేసింది. దాడిలో వీఆర్ఏ మృతి చెందారు. నిన్నరాత్రి ఇసుక మాఫియా ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నించింది. ఈసమయంలో గౌతమ్ వారిని అడ్డుకున్నాడు. దీంతో ముఠా సభ్యులు గౌతమ్ ను చితక బాదారు. తీవ్ర గాయాలైన గౌతమ్ ను ఆస్పత్రికి తరలించినా ప్రాణం నిలవలేదు.
Also Read : Somu Veerraju : 2024 తర్వాత రాజకీయాల్లో ఉండను.. సోము వీర్రాజు సంచలన ప్రకటన
సమాచారం తెలుసుకున్న వీఆర్ఏల సంఘనాయకులు ఖండ్‌గావ్ కు తరలి వచ్చారు. గ్రామంలో ఇసుక మాఫియా ఆగడాలు ఆపాలని గ్రామస్థుల డిమాండ్ చేశారు.  కాగా….మంగళవారం ఉదయం గౌతమ్ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ ముందు నిరసన తెలిపారు. గౌతమ్ మరణానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు పోలీసులను కోరారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నాడనే కారణంతోనే తన భర్తపై మాఫియా దాడి చేసి హత్యకు పాల్పడిందని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు