19 ఏళ్లపాటు శారీరకంగా వాడుకున్నాడు….ఇప్పుడు వేరొకరితో వివాహం

  • Publish Date - March 10, 2020 / 07:50 AM IST

పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరును 19 ఏళ్లపాటు లైంగికంగా వాడుకుని, ఆమెపై  మోజు తీరాక ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కృష్ణాజిల్లా  పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసే మహిళ(35) 19 ఏళ్ల క్రితం విజయవాడ కానూరు లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివింది. 

ఆసమయంలో అక్కడే లాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న పట్నాల శ్రీరామ చంద్రమూర్తి తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఆమెతో చనువుగా ఉంటూ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు శ్రీరామ చంద్రమూర్తి. ఈక్రమంలో ఆమెను లొంగదీసుకుని తన శారీరక వాంఛలు తీర్చుకునేవాడు.

ఈలోగా ఆమెకు చెన్నైలో ఉద్యోగం రావటంతో మహిళ అక్కడకు వెళ్లిపోయింది. వీలు చిక్కినప్పుడల్లా చెన్నై వెళ్లి ఆమెతో రాసలీలలు కొనసాగించి వస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా పెళ్ళి విషయం ఎత్తితే మాత్రం మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. 

కొన్నాళ్ల కిందట శ్రీరామ చంద్రమూర్తి వేరొక మహిళను పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయం  ఇటీవల చెన్నైలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మహిళకు తెలియటంతో ఆమె విజయవాడ వచ్చి శ్రీరామచంద్రమూర్తిని అతడి తల్లి తండ్రుల్ని నిలదీసింది. దీంతో వారు ఆమెను బెదిరించి కులం పేరుతో దూషించారు. తీవ్రమనస్తాపానికి గురైన బాధితురాలు మోసపోయాననే బాధతో పెనమలూరు పోలీసు స్టేషన్ లో సోమవారం మార్చి9న  ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

See Also | నెల్లూరులో కరోనా అనుమానిత కేసు