అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తలుపుల మండలం గజ్జలప్పవారిపల్లిలో ఓ డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు కడప జిల్లా వేంపల్లికి చెందినవారుగా గుర్తించారు. డీసీఎం వాహనం పూల లోడుతో కడప జిల్లా వెంపల్లి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.