Sadist Wife : నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసిన భార్య

పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తలమధ్య జరిగిన గొడవలో భార్య భర్తను దారణంగా హింసించింది.

Sadist Wife :  పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తలమధ్య జరిగిన గొడవలో భార్య భర్తను దారణంగా హింసించింది. నిద్రపోతున్న భర్త పై శనివారం ఉదయం వేడి, వేడి నీళ్లను పోసి భార్య తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది.

భార్య పోసిన వేడినీరు బాధితుడి శరీరంలోని ప్రైవేట్ భాగాలపై పడటంతో ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడు ఏలూరు పత్తే బాధ సెంటర్ లో టైలర్ గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెండో పట్టణ సిఐ ఆది ప్రసాద్, ఎస్సై కిషోర్ బాబు లు వివరాలు సేకరిస్తున్నారు.

Also Read : Bomb Blast In Chhattisgarh : రాయపూర్ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు….. ఆరుగురు జవాన్లకు గాయాలు

ట్రెండింగ్ వార్తలు