AP PGECET 2025 Counselling Notification Released
ఏపీ పీజీఈసెట్-2025 కు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. జూలై 9వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు జూలై 9వ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ జూలై 12వ తేదీతో పూర్తవుతుంది. జూలై 17వ నుంచి వెబ్ ఆప్షన్లు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
ఇక ఏపీ పీజీఈసెట్ – 2025 కోసం మొత్తం 3 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షలకు 14,231 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 11,244 మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు.