DRDO Recruitment 2025 Registration Process Started
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డీఆర్డీఓకి చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 152 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయనున్నారు. కాబట్టి, అర్హుత, ఆసక్తి గల అభ్యర్థులు డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్ rac.gov.in ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. జులై 18, 2025 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. మరిన్ని వివరాలు మీకోసం.
ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనే అర్హులైన అభ్యర్థులను తాము సాధించిన గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. కేటగిరీ వారీగా మెరిట్ జాబితా ప్రకారం 1:10 నిష్పత్తిలో ఎంపిక జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావలి. అందుకోసం ఆర్ఏసీ వెబ్సైట్లో ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ నుంచి తమకు నచ్చిన టెంటెటివ్ ఇంటర్వ్యూ తేదీని ఎంచుకోవాలి. గేట్ స్కోర్కు 80%, వ్యక్తిగత ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 20% వెయిటేజ్ కలిపి మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము ఉండదు.